నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : కొండా సురేఖ

by Disha Web Desk 23 |
నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి :  కొండా సురేఖ
X

దిశ, కొండపాక: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, కోట్ల రూపాయలు కొల్లగొట్టరని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ కొండా సురేఖ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వి కల్లబొల్లి మాటలు అని 9 ఏళ్ల పాలనలో మెదక్ పార్లమెంట్ లో అభివృద్ధి శూన్యం అని అన్నారు. సోమవారం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని కొండపాక , కుకునూర్ పల్లి మండల కేంద్రం లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల వంటి ప్రాజెక్టులలో కోట్ల రూపాయల పర్సెంటేజీలు తీసుకుని, వారి అవసరాల నిమిత్తమే పనులు చేశారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ బయట పనులు వ్యవహారం చక్క దిద్దితే, ఆయన కుమారుడు కేటీఆర్ షాడో సీఎంగా పనిచేశారని పేర్కొన్నారు.

ఆయా పనుల ప్రస్తావనకు సంబంధించి వారిని ప్రశ్నిస్తే తప్పించుకునే వారన్నారు. మంచి జరిగితే ఇది మావల్లే సాధ్యమైందని, చెడు జరిగితే ఎదుటి వాళ్ల మీదకు నెట్టేలా రాజకీయం చేశారని విమర్శించారు. ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గానికి విచ్చేసిన తనకు ఈ ప్రాంతాన్ని కేసీఆర్ ఏం అభివృద్ధి చేశాడో? కనిపించలేదన్నారు. కనీసం రోడ్లు కూడా సరిగా వేయించిన కెసిఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాడో? ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాలేశ్వరం చూస్తే కృంగిపోయింది, మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయింది, వాటిని చూసి ఎందుకు పెడితే మాజీ సీఎం కేసీఆర్ అవహేళన గా మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కరెక్ట్ గా డిజైన్ చేసి ఉంటే తెలంగాణ ప్రజలంతా సంతోషించే వారిని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

వల్లకాడు చేసిండు.. మైనంపల్లి హనుమంతరావు..

మెదక్ ను మాజీ మంత్రి హరీష్ రావు వల్లకాడు చేశాడని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. ఇంటి అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండపాక కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి, హైదరాబాదులో తేలేవాడని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో మార్కెట్ కమిటీలను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 10 ఏళ్లు ఇక్కడ నాయకుల మధ్య పంచాయతీలు పెట్టించలేని హరీష్ రావుకు సరిపోయిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును గెలిపించి, బీఆర్ఎస్ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదింటి బిడ్డ కు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ బీసీ కుల ఘనతకు తీర్మానం చేసింది, ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఘోష చూడలక సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. వెంకట్ రాంరెడ్డి రైతుల కన్నీళ్లతో ప్రాజెక్ట్ కట్టించాడు. బీజేపీ,బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు మండిపడ్డారు. త్యాగాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసేది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

బీజేపీ మతాల మీద రాజకీయం చేస్తుందనీ విమర్శించారు. ఈ కార్యక్రమం లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్స రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి,కొండపాక కుకునూర్ పల్లి మండలల పార్టీ ప్రెసిడెంట్ లు వాసరి లింగరావు, విరుపాక శ్రీనివాస్ రెడ్డి, పిఎన్ ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్, ఎం పి టి సి లు విరుపాక ప్రణవి, మాజీ సర్పంచ్ లు కాసం నవీన్ కుమార్ ,బోడ పట్ల ఐలం శివ, పిఎసిఎస్ డైరెక్టర్ లు బూర్గుల సురేందర్ రావు, సిర్వోజు నరసింహ చారి , కొప్పునూరు వీరేశం తదితరులు పాల్గొన్నారు

Next Story