కడియం కాదు.. నేను అసలుసిసలైన మాదిగను.. మాజీ MLA రాజయ్య కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కడియం కాదు.. నేను అసలుసిసలైన మాదిగను.. మాజీ MLA రాజయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ సర్టిఫికేట్లతో కడియం శ్రీహరి అక్రమంగా రిజర్వేషన్‌ను వాడుకుంటున్నారని.. అసలు సిసలైన మాదిగను తాననని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని పార్టీ వీడారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో కీలక పదవులు అనుభవించి కేసీఆర్‌కు కడియం శ్రీహరి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో శ్రీహరి కూతురు కావ్య ఓటమి ఖాయమని.. ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నుండి గెలిచిన కడియం శ్రీహరి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్‌గా రాజయ్యను కేసీఆర్ నియమించారు.



Next Story