- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హామీలు నెరవేర్చకపోతే పోరాటం చేస్తాం : ఎమ్మెల్యే గంగుల
దిశ,కరీంనగర్ టౌన్ : ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చాలని, లేకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ తెలియజేశారు. శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు కరీంనగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ… రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని, వెంటనే రైతుబంధు నిధులు కర్షకుల ఖాతాల్లో జమ చేయాలని, కౌలు రైతులకు హామీ ఇచ్చిన విధంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు సాగునీరు అందక పంట నష్టం పోయారన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం అందించాలన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా హామీలు పూర్తి చేయని కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.