- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు లింగమూర్తి కన్నుమూత
దిశ, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లింగమూర్తి గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. లింగమూర్తి ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించగా బీపీ తక్కువ ఉండటంతో ఆసుపత్రికి వెళ్లాలని సూచించడంతో బయటకు వచ్చి ఒక్కసారిగా రోడ్డు మీద కుప్పకూలిపోయారు.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు లింగమూర్తిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా లింగమూర్తి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. ప్రస్తుతం ఓదెల మండల దిశ రిపోర్టర్గా పనిచేస్తున్న లింగమూర్తి పని చేస్తున్నారు. మృతుడు లింగమూర్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. లింగమూర్తి మృతి పట్ల దిశ ఎడిటర్ మార్కండేయ, నెట్ వర్క్ ఇంచార్జ్ ప్రవీణ్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణరావుతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.