సొంత నియోజకవర్గంలోనే ఈటలకు అవమానం.. షాకిచ్చిన మాజీ అనుచరుడు

by Disha Web Desk 19 |
సొంత నియోజకవర్గంలోనే ఈటలకు అవమానం.. షాకిచ్చిన మాజీ అనుచరుడు
X

దిశ, కరీంనగర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు తన సొంత నియోజకవర్గంలోనే భారీ షాక్ తగిలింది. సోమవారం జమ్మికుంట పట్టణంలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఒక దశలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న రీతిలో మాటల యుద్ధం కూడా సాగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరుకాగా.. ఆయనకంటే ముందు స్థానిక మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీంతో ఈటెల వర్గానికి టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కాదని అన్నదానం కార్యక్రమం ఎలా ప్రారంభిస్తారంటూ బీజేపీ లోకల్ లీడర్స్ బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈటల రాజేందర్ మాత్రం శివాలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించి ఆ కార్యక్రమం వద్ద నుంచి వెళ్లిపోవడం గమనార్హం. నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించుకున్న ఈటెల రాజేందర్‌కు ఎదురైన ఈ పరాభవం సర్వత్ర చర్చకు దారి తీసింది. గత సంవత్సరం వరకు ఈటల అనుచరునిగా ఉన్న తక్కలపల్లి రాజేశ్వరరావు ఆయనను కాదని అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం కొస మెరుపు.

READ MORE

వడ్డీతో సహా అన్ని చెల్లిస్తా: CM కేసీఆర్‌కు ఈటల వార్నింగ్

Next Story

Most Viewed