పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్‌సీగా జోగారెడ్డి

by Kema Shiva Kumar |

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పి.జోగారెడ్డి బాధ్యతలు చేపట్టారు.

పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్‌సీగా జోగారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పి.జోగారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ప్రజా‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలినారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన జోగారెడ్డి పంచాయతీ రాజ్ విభాగంలో 1989‌లో ఏఈగా చేరారు.

Next Story