- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోగి శరీరంలో వెయ్యికిపైగా రాళ్లు
దిశ, శేరిలింగంపల్లి: కాలేయం, పిత్తాశయం, పిత్త వాహిక నుండి 1000 (వెయ్యికి )పైగా రాళ్లను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు మాదాపూర్ మెడికవర్ వైద్యులు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక రోగి మూడు సంవత్సరాలుగా కడుపు నొప్పి, కామెర్లతో తరచుగా ఇబ్బంది పడేవాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్స్ అతనికి వేరుశెనగ పరిమాణం నుండి నిమ్మకాయ వరకు వివిధ పరిమాణంలో ఉన్న బహుళ పిత్తాశయం, పిత్త వాహిక రాళ్లు ఉన్నాయని గుర్తించారు. దీంతో పిత్త వాహిక వ్యవస్థకు వాపు వచ్చి మరింత ఇబ్బంది పడ్డాడు. పశ్చిమ బెంగాల్ నుండి మెడికవర్ హాస్పిటల్స్ కు వచ్చిన రోగిని లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ సర్జన్ డాక్టర్ కిషోర్ రెడ్డి రోగిని పరీక్షించి శస్త్రచికిత్స చేసి రాళ్ళని తొలగించాలని నిర్ణయించారు. రోగి కోలిసిస్టెక్టమీ (పిత్తాశయం యొక్క తొలగింపు) చేసి ప్రధాన పిత్త వాహిక తెరిచి దాదాపు 250 గ్రాముల 1000 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం రోగి కొలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలేయం ద్వారా విసర్జించే కొలెస్ట్రాల్ను కరిగించడానికి పిత్తంలో తగినంత రసాయనాలు ఉంటాయని, కానీ కాలేయం పిత్తం కరిగిపోయే దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ను విసర్జిస్తే, అదనపు కొలెస్ట్రాల్ స్ఫటికాలుగా మారి చివరికి రాళ్లుగా ఏర్పడతాయన్నారు. పిత్త వాహికలో రాయి చిక్కుకున్నప్పుడు, వైద్యున్ని కలవడం అవసరమని, లేకపోతే వాపు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, తీవ్రమైన అవయవ నష్టం కూడా జరగవచ్చని అన్నారు. రోగి, అతని కుటుంబ సభ్యులు డాక్టర్ కిషోర్ రెడ్డికి, అతని బృందానికి ధన్యవాదాలు తెలిపారు.