Group-1: పరీక్షపై హైకోర్టులో విచారణ.. ఫలితాల విడుదలపై కొనసాగుతోన్న సస్పెన్స్

by Disha Web Desk 19 |
Group-1: పరీక్షపై హైకోర్టులో విచారణ.. ఫలితాల విడుదలపై కొనసాగుతోన్న సస్పెన్స్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వహించిన గ్రూప్- 1 పరీక్షపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. బయోమెట్రిక్ ఏర్పాటు చెయ్యలేదంటూ పిటిషన్ దాఖలు చేసిన కొందరు అభ్యర్థులు.. ఫలితాలను ప్రకటించకుండా ఉత్తర్వులు జారీ చెయ్యాలని కోరారు. దీనిపై విచారణ జరిగిన సందర్భంగా.. ఇప్పటికే గ్రూప్ 1 కీ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని ధర్మాసనం ప్రశ్నించగా రిజల్ట్ తేదీని నిర్ణయించలేదని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ గురువారం వాదనలు వినిపిస్తారని చెప్పారు. దాంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, హైకోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చిన తర్వాత ఫలితాలు విడుదల చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.


Next Story