ట్రాన్స్‌జెండర్స్ ఔదార్యం.. చలివేంద్రం ఏర్పాటు

by Disha Web Desk 4 |
ట్రాన్స్‌జెండర్స్ ఔదార్యం.. చలివేంద్రం ఏర్పాటు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: వారు ట్రాన్స్ జెండర్స్ అయితే నేం తమ ఔదార్యాన్ని చాటుకుని ఔరా అనిపించారు. తీవ్రమైన ఎండలతో తల్లడిల్లే వారికి తమ వంతు సాయంగా ఉండాలని కోరుకున్నారు. వారే స్వయంగా డబ్బులు పోగేసుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణ సీఐ మల్లేష్ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. దారిన వెళ్లే వారికి ఎండ వేడిమి నుంచి దాహార్తి తీరుస్తున్నారు. ట్రాన్స్ జెండర్స్‌ను సమాజంలో అవహేళన చేయకుండా వారిని కూడా అన్ని వర్గాలు సమభావంతో చూడాలని సీఐ మల్లేష్ సూచించారు. వారు చేస్తున్న సామాజిక సేవలు సీఐతో పాటు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Next Story

Most Viewed