'12 మంది ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొడతాం'

by Disha Web Desk 2 |
12 మంది ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొడతాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులతో సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వ్యభిచారంగా మార్చారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై తాము ఫిర్యాదు చేస్తే అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు స్పందన దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ఫిర్యాదు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని పైలట్ రోహిత్ రెడ్డి అంటున్నారని, అంటే తాను దొంగ అని రోహిత్ రెడ్డి ఒప్పుకున్నట్లేకాదా అని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సీఎస్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొడతామని వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులతో మాట్లాడేందుకు సమయంలో లేని కేసీఆర్.. ఏపీ రైతులతో మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

Also Read..

కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు


Next Story

Most Viewed