అన్నదాతకు అండగా నిలిచేందుకే KCR పొలం బాట: మాజీ మంత్రి గంగుల

by Disha Web Desk 19 |
అన్నదాతకు అండగా నిలిచేందుకే KCR పొలం బాట: మాజీ మంత్రి గంగుల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి.. రైతులకు బాసటగా నిలిచేందుకు ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రానున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా సోమవారం కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్ కుమార్ నివాసంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, పలువురు నాయకులతో ఎమ్మెల్యే గంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ పొలంబాట పట్టారని చెప్పారు.

ఇందులో భాగంగా ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొనున్నారని వెల్లడించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి.. పొలాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. అన్నదాతలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించనున్నారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్ గ్రామంలో ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటారని అనంతరం చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలించి.. సిరిసిల్ల పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని తెలిపారు.



Next Story