- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హైదరాబాద్లో కలకలం రేపుతోన్న ఫ్లెక్సీ.. మరోసారి సేమ్ సీన్ రిపీట్!
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్పై తెలంగాణలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ హైదరాబాద్లో ఫ్లెక్లీలు కలకలం రేపాయి. 'తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్' అని రాసి ఉన్న భారీ ఫ్లెక్సీ హైదరాబాద్లో గురువారం దర్శనం ఇచ్చింది. ఈ ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉంది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారో తెలియనప్పటికీ.. కేంద్రం వైఖరి తెలంగాణ పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉందని విమర్శిస్తూ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్గా మారింది. కాగా, కేంద్ర బడ్జెట్పై తెలంగాణలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఇది ప్రజామోద బడ్జెట్ అని బీజేపీ చెబుతుంటే.. రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచేయి చూపిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సర్కార్ వినతులను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఇది రైతుల, పేదల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ దర్శనం ఇవ్వడం కలకలం రేపుతోంది. గతంలోనూ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగింది. మోడీ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. తాజాగా అలాంటి సీనే మరోసారి యూనియన్ బడ్జెట్ విషయంలో బహిర్గతం కావడం చర్చగా మారింది.