రామ భక్తులకు షాక్.. రాజాసింగ్ శోభ యాత్రకు అనుమతి నిరాకరణ

by Disha Web Desk 12 |
రామ భక్తులకు షాక్.. రాజాసింగ్ శోభ యాత్రకు అనుమతి నిరాకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో జరిగే శోభాయాత్రకు దక్షిణ భారతదేశంలో గొప్ప పేరు ఉంది. అందులో ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించే రామనవమి శోభాయాత్రకు లక్షల సంఖ్యలో రామభక్తులు, హిందూ సంఘాల నేతలు పాల్గొంటారు. ఈ క్రమంలోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత వస్తున్న మొదటి రామనవమి కావడంతో హైదరాబాద్ పరిధిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో అన్ని హిందూ సంఘాల శోభ యాత్రలకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అందుకు తగ్గట్టు ఏర్పాటు చేశారు. కాగా రాజా సింగ్ నిర్వహించే శోభాయాత్రకు మాత్రం పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టిపరిస్థితుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుతామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రాజాసింగ్ అభిమానులు, రామభక్తులు ఆకాశ్‌పూరి హనుమాన్ టెంపుల్ వద్దకు చేరుకున్నారు. దీంతో పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed