ప్రచారంలో అందుకే కేసీఆర్ ‘బస్సు’ను వాడుతున్నారు.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ప్రచారంలో అందుకే కేసీఆర్ ‘బస్సు’ను వాడుతున్నారు.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్‌ వద్ద గద్దర్‌కు జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకొని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కారు పని అయిపోయందని.. అందుకే కేసీఆర్ బస్సు వేసుకొని బయలుదేరాడని ఎద్దేవా చేశారు. గద్దర్ కలవడానికి వస్తే నాలుగు గంటల పాటు గేటు బయటే నిలబెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి ఖతం చేశారని అన్నారు. చేతులు కాలినాక కేసీఆర్ ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని సెటైర్ వేశారు.

కేసీఆరే కాదు.. పదేళ్ల నుంచి ప్రధాని మోడీ కూడా దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పి నిండా ముంచాడని అన్నారు. ఒక్కరి ఖాతాలో కూడా రూ.15 లక్షలు వేయలేదని మండిపడ్దారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదని చెప్పారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని చెప్పారు. కులగణనతో బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని తెలిపారు.



Next Story

Most Viewed