- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోకాపేటలో భారత్ భవన్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
దిశ,వెబ్డెస్క్: హైదరాబాద్ కోకాపేట్కు వెళ్లిన సీఎం కేసీఆర్ భారత్ భవన్కు శంకుస్థాపన చేశారు. అక్కడ అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు. 15 అంతస్థుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. 11 ఎకరాల స్థలంలో భవనం నిర్మాణం చేపడుతున్నారు. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ & HRDగా ఆ భవనానికి నామకరణం చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని కేవలం ఐదు రోజుల్లోనే భూ కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హెచ్ఆర్డీ భవనంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. స్టేట్ ఆర్ట్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పించనున్నారు. భారత్ భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.