వామపక్షాలతో పొత్తులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Disha Web Desk 7 |
వామపక్షాలతో పొత్తులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది:  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: వామపక్షాలతో పొత్తులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడారు. వామపక్ష పార్టీలతో సీట్ల సర్ధుబాటు విషయమై చర్చలు జరుపుతున్నట్టుగా ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రానున్నట్లు తెల్చిచేప్పారు. సీట్ల సర్ధుబాటు విషయంలో ఆలస్యం అవుతున్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ టికెట్ల కోసం నేతల మధ్య పోటీ ఉందని, దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని అన్నారు. పార్టీ కోసం పని చేసేవారిని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, పార్టీ టికెట్టు రాకపోతే వారితో పార్టీకి అవసరం లేదనే అభిప్రాయం వీడాలని, అధికారంలోకి రాగానే టికెట్లు రాని వారికి సముచిత స్థానం కల్పిస్తామని భట్టి వివరణ ఇచ్చారు.

Next Story