ఎమ్మెల్సీ కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్..!

by Dishafeatures2 |
ఎమ్మెల్సీ కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్..!
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ మెంబర్ గా ఉన్న తనోబా ఒకప్పుడు తెలంగాణ జాగృతి మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారని గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఎన్ని పోస్టులు ఎవరెవరికి అమ్ముడు పోయాయో అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed