పోలింగ్ బూత్‌ల నుంచి వెనుదిరుగుతున్న BRS క్యాండిడేట్స్

by Rajesh |
పోలింగ్ బూత్‌ల నుంచి వెనుదిరుగుతున్న BRS క్యాండిడేట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అభ్యర్థులకు రౌండ్ రౌండ్‌కు లీడ్ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరుగుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగానే ఆశలు వదులుకున్నారు. మొత్తం ఒక్కో నియోజకవర్గానికి 20కి పైగా రౌండ్లు ఉన్నప్పటికీ ముందే ఒటమిని గ్రహిస్తున్న కారుపార్టీ నేతలు లెక్కింపు కేంద్రాల నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ కూర్చున్న లాభం లేదని విచార వదనంతో తిరుగుముఖం పట్టారు. పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి, చెన్నూరులో బాల్క సుమన్ కౌంటింగ్ కేంద్రం నుంచి విచారంతో వెనుదిరిగారు. ఇలా 60పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వస్తుండటంతో అంతా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు.



Next Story

Most Viewed