BREAKING: సీఎం రేవంత్‌పై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

by Disha Web Desk 19 |
BREAKING: సీఎం రేవంత్‌పై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ప్రతినిధులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే బీజేపీ సీఎం రేవంత్ రెడ్డికి మరో షాక్ ఇచ్చింది. మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని కాషాయ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు.

ఎన్నికల వేళ బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తోన్న సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బీజేపీ నేతలు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ వేదికపై మాట్లాడిన.. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేస్తోందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. వేదిక ఏదైనా సరే రేవంత్ రెడ్డి నేరుగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనేతలు సైతం కౌంటర్లు ఇస్తుండగా.. మరోవైపు పోలీసులు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Read More...

తెలంగాణలో BJP గెలవబోయే MP సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన అమిత్ షా

Next Story

Most Viewed