ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్తల నియామకం

by Disha Web Desk 1 |
ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్తల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం అసెంబ్లీలకు నేతల పేర్లను ప్రకటించారు. పాలేరు- ఎమ్మెల్సీ తాత మధు, ఖమ్మం- డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, వైరా- పార్టీ సీనియర్ నాయకుడు తాళ్ళూరి జీవన్, మధిర -మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కొత్తగూడెం- పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పలపాటి వెంకటరమణ, సత్తుపల్లి -పార్టీ సీనియర్ నాయకుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అశ్వారావుపేట-పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు చిన్ని‌లను సమన్వయకర్తలను నియమించారు.

Next Story