- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్బరుద్దీన్తో భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే
దిశ, వెబ్డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ది అసెంబ్లీలో తన పక్క సీటు అని, రోజూ మాట్లాడినట్లుగానే మాట్లాడాను అని అన్నారు. తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని తెలిపారు. తోటి ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర పరిస్థితులపై చర్చించుకున్నట్లు వెల్లడించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ను కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి పనిచేయాలనే అంశంపై చర్చించలేదని స్పష్టం చేశారు. 50 స్థానాల్లో పోటీ అంశంపై చర్చించుకున్నామని అన్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం, కాంగ్రెస్ పాత మిత్రులే అని, తమ ఇద్దరి టార్గెట్ ఒక్కటే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమవి సెక్యూలర్ భావాలున్న పార్టీలు అని వ్యాఖ్యానించారు. భవిష్యత్లో తాము కలిసిపోతామా? లేదా? అనేది కాలం నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం, రాష్ట్రంలో జరుగుతోన్న తాజా పరిణామాలపై చర్చించామని అన్నారు.