తీన్మార్ మల్లన్నకు షాక్.. రామకృష్ణపూర్‌లో అడ్డుకున్న BRS కార్యకర్తలు

by Disha Web Desk 7 |
తీన్మార్ మల్లన్నకు షాక్.. రామకృష్ణపూర్‌లో అడ్డుకున్న BRS కార్యకర్తలు
X

దిశ, రామకృష్ణాపూర్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తూ రాజకీయనేతగా ఎదిగిన క్యూ న్యూస్‌ తీన్మార్‌ మల్లన్న ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలో పర్యటించారు. అనంతరం అంగడి బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు అభివృద్ధి పనులు చేయకపోతే రీకాల్ సిస్టం ద్వారా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రిని కూడా గద్దె దించే హక్కు కోసం పోరాడుతున్నానని అన్నారు. రీకాల్ సిస్టానికి ప్రజలు ఓటు ద్వారా మద్దతు తెలపాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఎండ కడుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ మల్లన్న అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, మల్లన్న టీం సభ్యులకు వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నస్పూర్‌లో తీన్మార్ మల్లన్న పర్యటన.

Next Story