- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
దిశ, వాంకిడి : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేళ వరుసగా ఆ పార్టీని నేతలు వీడుతున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ లు మాజీ ఎమ్మెల్యే కోనప్ప తో కలిసి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగేల నాగేశ్వర్ రావు ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్ లతో పాటు మాజీ ఎంపీటీసీలు,సర్పంచ్ హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.
టీడీపీలో హయాంలో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో పదవులు చేపట్టిన ఆయనకు బీఆర్ఎస్ సముచిత స్థానం దక్కలేదని అసంతృప్తితో పార్టీని వీడి నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడటంతో ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆత్రం సక్కు మినహా చెప్పుకోదగ్గ ముఖ్య నేతలు ఎవరు బీఆర్ఎస్ లేకుండా పోయారు. దీంతో ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల పై తీవ్ర ప్రభావం చూపానుంది.