VRAలకు సంఘీభావం తెలిపిన బలరాం జాదవ్

by Dishanational2 |
VRAలకు సంఘీభావం తెలిపిన బలరాం జాదవ్
X

దిశా నేరడిగొండ: నేరడిగొండ మండలకేంద్రంలో వీఆర్ఏలు 17 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు తెలంగాణరాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని అన్నారు. 23 వేల మంది వీఆర్ఏల న్యాయ పరమైన డిమాండ్లలో ముఖ్యంగా బేసిక్ పే, హెచ్ఆర్ఎ, క్వాలిఫికేషన్ ఆధారంగా ప్రమోషన్లు ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బలరాం జాదవ్ డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సాక్షిగా 2017 లో వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించారని దీని గురించి ఇప్పటి వరకు ఊసెత్తడం లేదన్నారు. రెండు మూడు సార్లు అసెంబ్లీలో ప్రకటించినా దానిని పట్టించుకోకపోవడం సమంజసం కాదని ఇలా చేస్తే 23 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed