- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
గోత్రం ఏం చదివించారు బ్రో!.. ఫైనల్ లో ఎస్ఆర్హెచ్ టీం గెలవాలని అభిషేకాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ లో నిన్న జరిగిన క్వాలిఫైయర్ -2 లో రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఫైనల్ వెళ్లిన కోలకత్తాతో ఆదివారం హైదరాబాద్ తలపడనుంది. టైటిల్ పోరులో ఫైనల్ కు వెళ్లడం ఇది మూడోసారి. దీంతో రేపటి మ్యాచ్ ఎలాగైన గెలవాలని ఓ వైపు ఎస్ఆర్హెచ్ టీం తీవ్ర కసరత్తులు చేస్తోండగా మరో వైపు అభిమానులు మ్యాచ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే ఎస్ఆర్హెచ్ గెలుపు కోసం తెలంగాణలో కొందరు అభిమానులు రామునికి అభిషేకాలు చేయడం ఆసక్తిగా మారింది.
దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో కొందరు అభిమానులు ఎస్ఆర్హెచ్ టీం తో పాటు, ఆటగాళ్ల పేర్లపై కూడా శ్రీరాముని గుళ్లో అభిషేకాలు నిర్వహించారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఎస్ఆర్హెచ్ టీంతో పాటు ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ అభిమానుల భక్తిని మెచ్చుకుంటూ.. కొందరు నెట్టింట కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు బిన్నంగా స్పందిస్తున్నారు. ముందు సప్లీలు క్లియర్ చెయ్యండిరా అని ఓ నెటిజన్ అనగా.. హర్షిత్ రాణాకి పగిలిపోవాలని మొక్కండి అని, ఇంతకీ గోత్రం ఏం చదివించారు బ్రో అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.