- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీసీ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం
దిశ, నేరేడుచర్ల : బీసీ గురుకుల విద్యాలయంలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. క్లాసు రూమ్లో ఫ్యాన్కి స్కార్పుతో ఉరి వేసుకొని జిలోజు శివాని (14) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మాహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం సంబంధించిన పాఠశాలను అక్కడ సరైన భవనం లేకపోవడంతో దానిని హుజూర్నగర్లోని(పాత గాయత్రి డిగ్రీ కళాశాలను) ఒక భవనం అద్దెకి తీసుకొని నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
పాఠశాల ప్రిన్సిపల్ అనిత ఆర్సిఓ షకీలా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం బక్కయ్య గూడెం గ్రామానికి చెందిన జె శివాని 5వతరగతి నుండి ఇదే స్కూల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఇటీవల కాలంలో కొంతమంది తన ఫ్రెండ్స్తో కలిసి రోడ్డు వెంట వెళ్లే వారికి హాయ్ బాయ్ చెబుతున్నారని తెలిపారు. ఇలా చెప్పేవారిని ఆ క్లాసులో 8మంది విద్యార్థులుగా గుర్తించి టీచర్లు వారిని పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. ఆయిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సోమవారం వారి పేరెంట్స్ను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ విద్యార్థినులు చేస్తున్న ప్రవర్తనను తల్లిదండ్రులకు వివరించినట్లు తెలిపారు.
8మందిలో ఆరుగురు పేరెంట్స్ అటెండ్ అయ్యారని వివరించారు. ఒక విద్యార్థిని అంతకుముందే పండగ ఉందని ఇంటికి వెళ్లిపోయిందన్నారు. మిగతా ఏడుగురు విద్యార్థుల పేరెంట్స్ మీటింగ్కి శివాని పేరెంట్స్ తప్ప అందరూ హాజరయ్యారని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థుల పేరెంట్స్కు చెప్పి నాలుగు రోజులు ఇంటికి తీసుకువెళ్తే వాతావరణం మార్పుతో పాటు వాళ్ల పద్ధతి మారుతుందని ఆశించి ఇంటికి పంపించామని తెలిపారు. ఈ పేరెంట్స్ మీటింగ్కి శివాని పేరెంట్స్కి సమాచారం అందించామని కానీ వారు అందుబాటులో లేకపోవడంతో రాలేదని తెలిపారు.
మంగళవారం వస్తామని తమకు సమాచారం ఇచ్చారన్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున క్లాస్ రూమ్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె వివరించారు. నైట్ కేర్ టీచర్గా ఉన్న భరణి గుర్తించి సమాచారం అందించిందని తెలిపారు. ఇది గుర్తించిన టీచర్ భరణి ప్రిన్సిపల్కు ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం అందించింది. ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విద్యార్థిని శివాని మృదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థిని పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడే విషయం తెలుసుకున్న ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు కొంతమంది పార్టీ నాయకులు అక్కడ చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఆత్మహత్య వెనక గల కారణాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని కోరారు. వీటికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను ఇంటికి పంపించాలని కోరడంతో ఆ విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ పాఠశాలకు కోదాడ డిఎస్పి ప్రకాష్ యాదవ్ సీఐ రామలింగారెడ్డి చేసి దర్యాప్తు పడుతున్నారు.
తల్లిదండ్రులు మందలిస్తారని భయంతోనేనా...!?
పేరెంట్స్ మీటింగ్ వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులు ఆ స్కూల్లోనే టీచర్ల ముందు విద్యార్థినులను కొట్టి తిట్టి ఇంటికి తీసుకువెళ్లారు. ఇదంతా గమనించిన శివాని తమ తల్లిదండ్రులు కూడా కొడతారని ఇంటికి తీసుకువెళ్తారనే భయంతోనే ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తుంది..
నిన్నటి నుండి శివాని ప్రవర్తనలో మార్పు
నిన్న పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత శివాని ఫ్రెండ్స్ను వారి తల్లిదండ్రులు తిట్టి కొట్టి తీసుకువెళ్లిన తర్వాత శివాని ప్రవర్తనలో కొంత మార్పు వచ్చిందని సమాచారం. శివాని ప్రవర్తన గమనించిన ఫ్రెండ్స్ ఆమెను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేశారని రాత్రి ఆమె పక్కనే పండుకున్నారని వారు నిద్రపోతున్న సమయానికి వెళ్లి ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.