వాహనంలో తరలిస్తుండగా ఒక్కసారిగా పేలిన సిలిండర్లు.. తర్వాత ఏం జరిగిందంటే..?

by Disha Web Desk 4 |
వాహనంలో తరలిస్తుండగా ఒక్కసారిగా పేలిన సిలిండర్లు.. తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో బిల్లుడు తండ గ్రామపంచాయతీ పరిది రామకృష్ణాపురం, మంగళి తండ మధ్యలో సిలిండర్లతో వెళ్తున్న వాహనంలో మంటలు వ్యాపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్న కొత్త బ్రిడ్జిపై శ్రీ తేజస్విని గ్యాస్ ఏజెన్సీ సంస్థకు సంబంధించిన అశోక్ లేలాండ్ వాహనంలో ఇంజన్ పరంగా సమస్య ఉండడం వల్ల పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బండి క్యాబిన్‌కి మంటలు అంటుకొని క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. ట్రాలీ డ్రైవర్ చక్రి, హెల్పేర్ శ్రీకాంత్ చాకచక్యంగా ఫుల్‌గా ఉన్న సిలిండర్లను వెంటనే దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఊరు బయట జరగడం వల్ల ఎటువంటి ప్రాణాష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో రూ.23వేలు కాలిపోయాయి.

Next Story

Most Viewed