ఇనుప రాడ్డుతో గుండెల్లో పొడిచి యువకుడి దారుణ హత్య

by Disha Web Desk 4 |
ఇనుప రాడ్డుతో గుండెల్లో పొడిచి యువకుడి దారుణ హత్య
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మరో యువకుడు ఇనుపరాడుతో సరిగ్గా గుండెల్లో పొడిచి అతి దారుణంగా ఓ యువకుడిని హత్య చేసిన ఘటన బుదవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది . స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన భాను (18) అనే యువకుడు అదే మండల కేంద్రానికి చెందిన విక్టర్ అనే యువకులు ఇద్దరు మండల కేంద్రంలోని వద్దేమాన్ కమాన్ వద్ద మద్యం సేవించారు. పాత కక్షల నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.

కాగా బలమైన ఇనుప రాడ్డుతో భాను అనే యువకుడి గుండెల మీద పొడవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి 108 సాయంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే విక్టర్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా భాను అనే యువకుడు గత మూడు ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story