జలమండలి వర్షాకాల కార్యాచరణ.. మీకు తెలుసా?

by  |
జలమండలి వర్షాకాల కార్యాచరణ.. మీకు తెలుసా?
X

దిశ, న్యూస్ బ్యూరో: వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటీకే నగరంలోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాకాల కార్యాచరణ, మంచినీటి సరఫరా వంటి విషయాలపై గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. కొవిడ్-19 కరోనా కాలంలో కూడా మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు సరఫరా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ ప్రాంగణం, కార్యాలయాలు, సీవరేజీ పనిచేసే ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేయాలని, సిబ్బంది శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. నగరంలో నీళ్లు నిలిచే 185 ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశామన్నారు. వర్షం వచ్చే సమయంలో సీవరేజీ సూపర్‌వైజర్లను నియమించి ప్రత్యేక దృష్టి చూపాలని అధికారులను ఆదేశించారు. లోతుగా ఉన్న మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు యూనిఫాం ధరించాలని ఎండీ ఆదేశించారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని సూచించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, మేనేజర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed