తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

by Disha Web Desk 15 |
తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
X

దిశ, ఖమ్మం : తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ప్రపంచ తలసేమియా దినోత్సవంను పురస్కరించుకొని తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ ‌ఆధ్వర్యంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు కూరపాటి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన ఖమ్మంలోని లేక్ వ్యూ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.‌ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చిన్నారులతో కలిసి కట్ చేసి తినిపించి దీవించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధి తో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి మీ వంతు కృషిని అందించాలని కోరారు. తలసేమియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ

తమ వంతుగా మీకు తోచిన రీతిలో వారికి రక్తం అందించేందుకు సహకరించాలని కోరారు. ఇది చాలా పెద్ద బాధ్యత అని, ఇంతటి సమర్థవంతమైన బాధ్యత నిర్వహిస్తున్న టీఎస్సీఎస్, డా. కూరపాటి ప్రదీప్ ను మంత్రి అభినందించారు. తలసేమియాను ఆదిలోనే గుర్తించేందుకు, దాని నిర్మూలనకై వివాహానికి ముందే HBA2టెస్ట్ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని వైదుల సూచనల మేరకు ఆ దిశగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డా.ప్రదీప్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా టీఎస్సీఎస్ వ్యవస్థాపకులు చంద్రకాంత్ అగర్వాల్ రత్నావలి చేస్తున్న సేవలను వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 24 వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు జావేద్ పాషా , కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా నారాయణ, సైదబాబు, పాలకుర్తి నాగేశ్వరావు, సొసైటీ డాక్టర్ రాజ్ కుమార్ , డాక్టర్​ యశ్మిత ,సభ్యులు నజీర్, అభిషేక్ శర్మ, సిరాజ్, నరేష్, వంశి, లక్ష్మీ, సుచరిత, మల్లేశ్, సుగుణ, దివ్య, నిర్మల, భద్రమ్మ మరియు పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Next Story