‘ఏపీలో హిందువుల పై దాడులు’

by  |
‘ఏపీలో హిందువుల పై దాడులు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో హిందువుల పై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సోమవారం లోక్‌సభలో మాట్లాడిన గల్లా.. రథాల దగ్ధం వ్యవహారాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు. ఇంత జరుగుతున్న ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శలు చేశారు. దేవాలయాల పై ప్రభుత్వ పెత్తనం కొనసాగుతోందని.. ఈ విషయం లో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తే.. భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 విగ్రహాలను ధ్వంసం చేశారని.. అయినా నిందితులను అరెస్ట్ చేయలేదని గల్లా జయదేవ్ వెల్లడించారు.

Next Story