విద్యార్థులకు సర్కార్ గిఫ్ట్

by  |
విద్యార్థులకు సర్కార్ గిఫ్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: విద్యార్థులకు తమిళ నాడు సర్కార్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఆన్ లైన్ క్లాస్‌ల నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత డేటా బ్యాలెన్స్ ఇచ్చేందుకు తమిళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటా చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 9.69 లక్షల మంది విద్యార్థులకు ఉచిత డేటా పథకాన్ని అందివ్వనుంది. ఈ పథకంలో ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం కింద విద్యార్థులకు ఉచిత డేటా అందించనున్నారు.


Next Story

Most Viewed