రాజేంద్రనగర్‌లో శ్రీనివాస్ మృతి

by  |
రాజేంద్రనగర్‌లో శ్రీనివాస్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తప్ప తాగి చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం నగరంలోని రాజేంద్రనగర్ లో మద్యం సేవించి కారుతో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు.



Next Story