రివాల్వర్​తో కాల్చుకొని RSI సూసైడ్

by  |
రివాల్వర్​తో కాల్చుకొని RSI సూసైడ్
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. కాపులుప్పాడ గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐ షణ్ముఖరావు రివాల్వార్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి గ్రేహౌండ్స్ యూనిట్లో రివాల్వార్‌తో కాల్చుకోగా వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. షణ్ముఖరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మామిడిపల్లి. 2015 బ్యాచ్‌కు చెందిన ఆర్ఎస్ఐకి.. భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. ఆర్​ఎస్​ఐ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story