ధావన్, పంత్‌లతో రూం షేర్ చేసుకోను.. ఎందుకంటే : రోహిత్

by Dishanational3 |
ధావన్, పంత్‌లతో రూం షేర్ చేసుకోను.. ఎందుకంటే : రోహిత్
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌తో కలిసి రూం పంచుకోలేనని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వారిద్దరు రూంను క్లీన్ ఉంచుకోకపోవడమే అందుకు కారణమని చెప్పాడు. తాజాగా ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా కపిల్ అడిగిన సరదా ప్రశ్నలకు రోహిత్, అయ్యర్ తమదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రూం షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలిసి షేర్ చేసుకుంటారని రోహిత్‌ను కపిల్ శర్మ అడిగాడు.

దీనికి రోహిత్ బదులిస్తూ ధావన్, రిషబ్ పంత్‌లతో మాత్రం తాను ఉండలేనని చెప్పాడు. ‘ఒక వేళ రూం షేర్ చేసుకోవాల్సి వస్తే ధావన్, పంత్‌లోత మాత్రం కలిసి ఉండను. వాళ్లు గదిని క్లీన్‌గా ఉంచుకోరు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక దుస్తులను మంచంపైనే పడేస్తారు. వారి రూం డోర్స్‌(డీఎన్‌డీ)పై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ బోర్డు ఉంటుంది. ఎందుకంటే, వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిద్రపోతారు. ఉదయం హౌజ్ కీపింగ్ సిబ్బంది రాకుండా డీఎన్‌డీ బోర్డులు పెడతారు. అందుకే వాళ్ల గదులు మూడు నాలుగు రోజులు చిందరవందరగా ఉంటాయి. కాబట్టి, వారితో ఉండే ఆటగాళ్లు ఇబ్బందులు పడతారు. అందుకే, నేను కూడా వాళ్లతో ఉండాలనుకోను.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed