- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జావెలిన్ త్రోయర్ శివపాల్పై నాలుగేళ్ల నిషేధం
దిశ, వెబ్డెస్క్: డోప్ టెస్టులో దొరికిపోవడంతో సస్సెన్షన్లో ఉన్నా.. భారత జావెలిన్ థ్రోయర్ శివపాల్ సింగ్పై వేటు పడింది. డోప్ టెస్టులో పాజిటివ్గా రావడంతో నాలుగేళ్ల పాటు ఆట నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. నేషనల్ డోపింగ్ ఏజెన్సీ కి చెందిన క్రమశిక్షణా సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్కి చెందిన 27 ఏళ్ల శివపాల్ సింగ్ టోక్యో ఒపింపిక్స్లో పాల్గొన్నాడు. డోప్ టెస్టులో దొరికిపోవడంతో ప్రస్తుతం నాలుగేళ్ల పాటు ఆటకు దూరం కానున్నాడు. 2025 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. అక్టోబర్ 21, 2021 నుంచి 2025 అక్టోబర్ చివరి వరకు నిషేధం అమలులో ఉండనుంది. 2019లో శివపాల్ సింగ్ ఆసియా ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ ఏడాదిలో NADA నిషేధానికి గురైన ఐదవ ప్లేయర్గా నిలిచాడు. టోక్యో ఒలింపియన్ కమల్ప్రీత్ కౌర్, ఎంఆర్ పూవమ్మ, స్పింటర్ ధనలక్ష్మీ శేఖర్, డిస్కస్ త్రోవర్ నవజీత్ కౌర్ ధిల్లన్లు డోపింగ్ కోడ్ ఉల్లంఘనల కారణంగా ఆటకు దూరమయ్యారు.