India vs Sri Lanka : మళ్లీ రెచ్చిపోయిన అభిషేక్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

by Harish |

ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది.

India vs Sri Lanka : మళ్లీ రెచ్చిపోయిన అభిషేక్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సూర్య సేన 20 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. మెరుపులు మెరిపించిన అతను 31 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతనికితోడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(49 నాటౌట్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్(39), అక్షర్ పటేల్(21 నాటౌట్) కూడా రాణించారు. దీంతో శ్రీలంక ముందు భారత్ 203 పరుగుల భారీ స్కోరు చేసింది.


Next Story