India vs Australia : ఒక్క మ్యాచుతో రికార్డుల మోత మోగించిన భారత్

by Disha Web Desk 12 |
India vs Australia : ఒక్క మ్యాచుతో రికార్డుల మోత మోగించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచులో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా హోల్కర్ స్టేడియంలో జరిగిన వన్డే విజయంతో భారత్ తమ 100% విజయాల రికార్డును ఏడుకి పొడిగించింది. అలాగే ఈ మ్యాచులో ఆస్ట్రేలియాపై భారత్ అత్యధిక వన్డే స్కోరు (399/5) నమోదు చేసింది. దీంతో పాటుగా వన్డేల్లో 3000 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Next Story

Most Viewed