తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు

by  |
తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రిని కొడుకు చంపి పొలంలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చేవెళ్ల మండలం గుండాలలో కిష్టయ్య అనే వ్యక్తి నెలరోజులుగా కనిపించకుండా పోవడంతో కొడుకును బంధువులు నిలదీయగా అసలు విషయాన్ని చెప్పాడు. తనతండ్రిని.. తల్లితో కలిసి చంపానని, మృతదేహాన్ని సొంత పొలంలోనే పాతిపెట్టానని చెప్పడంతో బంధువులంతా షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story