మోడీకి అమరావతి రైతుల సందేశం

by  |
మోడీకి అమరావతి రైతుల సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రైతులు చేసిన పనికి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వారు చేపట్టని నిరసన లేదు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి తమ గోడు గుర్తు చేసేలా ఓ సందేశం పంపుతున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఆయన ఢిల్లీ నుంచి మట్టి, నీరు తీసుకొచ్చి.. ఢిల్లీ కంటే గొప్ప రాజధానిగా అమరావతి ఎదగాలని వ్యాఖ్యానించారు. ఇదే మాటలను ప్రధానికి గుర్తు చేస్తూ.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి అమరావతి నుంచి మట్టి, నీరును ప్రధాని మోడీకి పంపుతున్నారు.

Next Story

Most Viewed