- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ 2021 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పీవీ సింధు వ్యోనీ లిపై 21-12, 21-18 తేడాతో ఓడించింది. సింధు శుక్రవారం సిమ్ యుజిన్తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో బి. సాయిప్రణీత్ 21-17, 14-21, 21-19 తేడాతో క్రిస్టో పోపోవ్పై గెలిచాడు. అతను క్వార్టర్ ఫైనల్లో విక్టర్ అక్సెల్సెన్తో తలపడనున్నాడు. పురుషుల స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విక్టర్ అక్సెల్సెన్పై 14-21, 18-21 తేడాతో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్లో సాత్వీక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి 21-15, 19-21, 23-21 తేడాతో కాంగ్ మిన్యుక్-సియో సెన్జీపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. అక్కడ మలేషియాకు చెందిన గో సెఫీ – నుర్ ఇజ్జుద్దీన్తో సెమీఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నారు.
- Tags
- Indonesia open