దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన ప్రశంసలు

by  |
దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన ప్రశంసలు
X

ముంబయి: మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై అధికార పార్టీ శివసేన ప్రశంసలు కురిపించింది. ప్రతిపక్ష నేతగా ఆయన సమర్థవంతంగా రాణిస్తున్నారని శివసేన మౌత్‌పీస్ సామ్నా కితాబిచ్చింది. సీఎంగా ఉన్నప్పుడు ఎంత డైనమిక్‌తో ఉన్నారో ఇప్పుడూ అదే విధంగా కొనసాగుతున్నారని ప్రశంసించింది. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ పోరును ఆయన ప్రశంసించడం ఆనందదాయకమని, ఆయన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ప్రజలకూ భరోసానిచ్చిందని తెలిపింది.

కొంతమంది అతన్ని ట్రోల్స్ చేస్తున్నారని, అది సరికాదని అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేతగా ఆయన సరిగ్గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల, ఆరోగ్య వసతులను పరిశీలిస్తున్నారు. కరోనాపై శివసేన సర్కారు దీటుగా పోరాడుతున్నదని దేవేంద్రఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ తనకు కరోనా పాజిటివ్ వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేర్చాలని ఫడ్నవీస్ ఓ సన్నిహితుడితో వ్యాఖ్యానించారు. ఈ స్టేట్‌మెంట్‌‌పై కొందరు అసహనం తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed