ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు

by  |
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ​కింద ఉన్న 573ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్​ ఆరోగ్యశ్రీ హెల్త్​కేర్ ​ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి రూ.31.97కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. 544ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలు చెల్లించినట్లు వివరించారు.


Next Story

Most Viewed