- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చస్తున్నా పట్టించుకోరా..? ఈ రంధ్రాన్ని ఎప్పుడు పూడుస్తారు
<p>దిశ, ఖమ్మం రూరల్ : నడిరోడ్డుపై రంధ్రం పడి మూడు రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. రూరల్ మండలం పెద్ద తండా వద్ద ఖమ్మం నుంచి సూర్యాపేట ప్రధాన రహదారి నడి మధ్యలో మూడు రోజుల కిందట రంధ్రం ఏర్పడింది. మొదట చిన్నదిగా ఉన్నా రోజురోజుకూ పెద్దదిగా మారుతోంది. నడిరోడ్డు పైన రంధ్రం పెద్దదిగా మారుతున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. వారు నిర్లక్ష్యానికి నిలువుటద్ధంలా తయారయ్యారు. రోడ్డుకు మధ్యలో ఏర్పడిన గుంతను గమనించకపోవడంతో ఇద్దరు […]</p>

దిశ, ఖమ్మం రూరల్ : నడిరోడ్డుపై రంధ్రం పడి మూడు రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. రూరల్ మండలం పెద్ద తండా వద్ద ఖమ్మం నుంచి సూర్యాపేట ప్రధాన రహదారి నడి మధ్యలో మూడు రోజుల కిందట రంధ్రం ఏర్పడింది. మొదట చిన్నదిగా ఉన్నా రోజురోజుకూ పెద్దదిగా మారుతోంది. నడిరోడ్డు పైన రంధ్రం పెద్దదిగా మారుతున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. వారు నిర్లక్ష్యానికి నిలువుటద్ధంలా తయారయ్యారు.
రోడ్డుకు మధ్యలో ఏర్పడిన గుంతను గమనించకపోవడంతో ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయి గాయాలపాలయ్యారు. కొందరు స్థానికులు మాత్రం రంధ్రం చుట్టు రాళ్లను ఏర్పాటు చేసి వాహనదారులను అలర్ట్ చేశారు. దీని వలన కేవలం ద్విచక్ర వాహనదారులకే కాదు పెద్ద వాహనాలైన కార్లు, లారీలు ఈ రంధ్రం మీద నుంచి వెళ్లితే ప్రమాదం జరగకమానదనే చెప్పాలి. ఇది ఇలాగే ఉంటే పెను ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.






