మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు.. చివరకు

by  |
మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు.. చివరకు
X

దిశ, దుబ్బాక : మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. శుక్రవారం దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి పాఠశాల‌లో పన్నెండు మంది విద్యార్థులను చితకబాదారు. దీంతో ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో A. సంజీవరెడ్డి SGT ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట డిఈఓ కె. రవికాంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే సస్పెన్షన్ అమలు లోనికి వచ్చిందని ఎంఈఓ ప్రభుదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిన ఎవరిపైన అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed