పరకాలను జిల్లా చేయాలని కోరుతూ ర్యాలీ

by  |
పరకాలను జిల్లా చేయాలని కోరుతూ ర్యాలీ
X

దిశ, పరకాల: పరకాల అమరవీరుల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. గత కొంత కాలంగా నిర్వహిస్తున్న జిల్లా ఉద్యమం శుక్రవారంతో ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది. అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పలు నినాదాలు చేస్తూ కొనసాగడంతో పాటు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డప్పు కళాకారులు పలు ప్రదర్శనల ద్వారా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం, బట్టల వర్తక సంఘం, గుమస్తాల సంఘం తో పాటు కాంగ్రెస్ బిజెపి సిపిఐ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు

Next Story

Most Viewed