- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : బర్త్డే బేబీ రాశీ ఖన్నా ఫ్యాన్స్ విషెస్తో సూపర్ హ్యపీగా ఉంది. సోషల్ మీడియాలో తన పేరు ట్రెండ్ అవుతుండగా.. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది రాశి. ఈ క్రమంలో తన ఫాలోవర్స్ను ఇన్స్పైర్ చేసేందుకు బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంది. బర్త్డే సందర్భంగా హైదరాబాద్లోని మెరెడియన్ స్కూల్లో మొక్కలు నాటింది.
ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండాలని అభిమానులను కోరిన బర్త్డే గర్ల్.. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని విపత్తులు ఎదుర్కోకుండా ఉండాలంటే ప్రకృతికి పచ్చదనాన్ని అందివ్వాలని అభిప్రాయపడింది. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అందరూ మొక్కలు నాటాలని కోరింది. ‘ఇది పెద్దగా ఇబ్బందిపడే విషయం కూడా కాదని.. చాలా సింపుల్ థింగ్’ అని తెలుపుతూ.. మీరు మొక్కలు నాటడమే నాకిచ్చే అతిపెద్ద బహుమతి అని చెప్పింది.