ఉమెన్స్ హాకీ టీంతో మాట్లాడిన మోడీ.. కన్నీరు పెట్టిన ప్లేయర్స్ (వీడియో)

by  |
hocky-team
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్లు మంచి పోరాట ప్రతిమను చూపించాయి. హాకీలో పురుషుల జట్టు కాంస్యం గెలిచింది.. మహిళల జట్టు కూడా కాంస్య పతకంతోనే తిరిగి దేశానికి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహిళల జట్టు అనూహ్యంగా.. బ్రిటన్ చేతిలో ఓటమిపాలైంది.

ఈ పోరులో కాంస్య పతకం చేజార్చుకున్నప్పటికీ.. భారత మహిళల పోరాటం మాత్రం అద్వితీయమని చెప్పక తప్పదు. అయితే.. వారి పోరాట పటిమను మాత్రం అందరూ ప్రశంసిస్తున్నారు. మీరు కాంస్యం తేకున్నా.. మాకు బంగారంతో సమానమేనని పేర్కొంటున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు. అంతేకాకుండా మహిళ జట్టు సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళా జట్టు సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Next Story

Most Viewed