వారి సహకారంతోనే నిజాంపేట్‌కు రాష్ట్రపతి అవార్డు: మేయర్

by  |
వారి సహకారంతోనే నిజాంపేట్‌కు రాష్ట్రపతి అవార్డు: మేయర్
X

దిశ, నిజాంపేట్: ప్రజలందరి సహకారం వల్లే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రాష్ట్రపతి అవార్డు రావడం జరిగిందని నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సఫాయి మిత్ర ఛాలెంజ్ -2021 రాష్ట్రపతి అవార్డు నిజాంపేట్ నగరానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. 24 వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లికార్జున్ బుధవారం మేయర్‌ను, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డిని వారి నివాసంలో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ మహిళలు ధనలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


Next Story

Most Viewed