‘సందేహాలు తొలగాలంటే మోడీ వ్యాక్సిన్ వేసుకోవాలి’

by  |
‘సందేహాలు తొలగాలంటే మోడీ వ్యాక్సిన్ వేసుకోవాలి’
X

దిశ,వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో చాలా ఆందోళనలు, సందేహాలు నెలకొన్నాయని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) నేత ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. వాటన్నింటినీ తొలగించాలంటే ప్రధాని మోడీ, సీఎం ఉద్దవ్ థాక్రేలు వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. టీకా తీసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఈనెల 27న మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ బాగ్ పేరిట ఆందోళనలను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed